తీర్మానాలు
నాల్గవ మహాసభల్లో ఏడు తీర్మానాలను ఆమోదించారు. అవి:

    1.తెలుగుభాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు. సాహిత్య, లలిత, సంగీత, నాటక అకాడమీల పునరుద్ధరణ.

    2. ఇతర రాష్ట్రాల భాషా సంస్కృతి అంశాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలుగు అధికార భాషా సంఘాన్ని కూడా ప్రత్యేక మంత్రిత్వశాఖ పరిధిలో చేర్చాలి.

    3. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అధికార భాషగా తెలుగును అమలు చేయాలి. ఇందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి.

    4. తెలుగు జానపద కళలు, ఇతర కళారూపాలు, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలపై పరిశోధన, ప్రదర్శన, పరిరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.

    5. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి పిల్లలు తెలుగు నేర్చుకునేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందించాలి. బోధనకు ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం సమకూర్చాలి.

    6. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు సాంస్కృతిక విద్యను ప్రత్యక అంశంగా చేర్చి విద్యార్థికి ఇష్టమైన ఏదైనా లలిత కళను అభ్యసించేలా చేయాలి. అందులో వచ్చిన మార్కులను విధిగా అన్ని సందర్భాల్లోనూ పరిగణనలోకి తీసుకోవాలి.

    7. ప్రతి అయిదేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలి.